న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి 1.6 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించడం ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం మిగిలిందని కేంద్ర ఆర్ధిక కార్యదర్శి అశోక్ లావాసా వెల్లడించారు. ఎల్ పీజీ గ్యాస్ ను అందించే విధానంలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ప్రభుత్వానికి మరో రూ.14,872 కోట్లు ఆదా అయినట్లు, దీంతో ఈ యేడాది 150 కొత్త పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుందని ఆయన తెలిపారు.