‘ప్రైవేటు’ సిజేరియన్‌కు ప్రభుత్వ సిఫార్సు తప్పనిసరి

28 May, 2018 04:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆయుష్మాన్‌ భారత్‌–జాతీయ ఆరోగ్య సంరక్షణ మిషన్‌(ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం)కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులు సిఫార్సు చేస్తేనే ఈ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్‌ ఆపరేషన్‌ నిర్వహించాల్సి ఉంటుందని ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం సీఈవో ఇందు భూషణ్‌ తెలిపారు. ఏ కారణం చేత సదరు ప్రభుత్వ ఆస్పత్రి సిజేరియన్‌కు సిఫార్సు చేసిందో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందన్నారు. దేశంలో సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలుత సహజ ప్రసవాలను ఈ పథకం పరిధిలో చేర్చలేదన్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమీ లేదా ఇతర కారణాలతో ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తే ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు