హోంమంత్రి అమిత్‌ షాతో గవర్నర్‌ భేటీ

10 Jun, 2019 13:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలను హోంమంత్రికి గవర్నర్‌ నివేదించారు. హోంమంత్రిగా అమిత్‌షా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి గవర్నర్‌ కలిశారు. భేటీ అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ... హోంమంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, స్నేహపూర్వకంగా ఉంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన ఉపయోగంలో లేని భవనాలను తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేశామన్నారు. ఏపీ భవన్‌ సహా విభజన సమస్యలను ఒక‍్కొక‍్కటిగా పరిష్కరిస్తామని గవర్నర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు