రాష్ట్రపతితో గవర్నర్ భేటీ, నివేదిక సమర్పణ

10 Jun, 2015 15:24 IST|Sakshi
రాష్ట్రపతితో గవర్నర్ భేటీ, నివేదిక సమర్పణ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది.  తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన అంశాలపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.  గవర్నర్ ఈ సందర్భంగా రాష్ట్రపతికి  నివేదిక సమర్పించారు. అలాగే సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో గవర్నర్ సమావేశం అవుతారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రపతితో సమావేశం కానున్నారు. అలాగే ప్రధానమంత్రి మోదీతో పాటు, సాయంత్రం 4.30 గంటలకు రాజ్నాథ్ సింగ్తో ఆయన భేటీ కానున్నారు. సాయంత్రం అయిదున్నరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, 6.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి  అరుణ్ జైట్లీతో చంద్రబాబు సమావేశం అవుతారు.

మరిన్ని వార్తలు