ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్

23 Aug, 2014 02:14 IST|Sakshi
ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్

లక్నో: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. పదవి నుంచి తప్పుకోవాలని తనకు చెప్పిందన్న ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. ‘ఆయనను తొలగించేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు’ అని స్పష్టం చేశారు.

ఈ అంశంపై త్వరలో సుప్రీం కోర్టుకు తగిన స్పందన తెలియజేస్తామన్నారు. రాజ్‌నాథ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వరదప్రాంతాల పర్యటన తర్వాత  మాట్లాడారు. మోడీ సర్కారు  వచ్చాక నలుగురు గవర్నర్లను మార్చింది.
 
 

మరిన్ని వార్తలు