సైగలతో జాతీయ గీతాలాపన

11 Aug, 2017 01:27 IST|Sakshi

న్యూఢిల్లీ: సైగలతో జాతీయ గీతం ఆలాపిస్తున్న వీడియోను కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండే గురువారం విడుదల చేశారు. దివ్యాంగులు, ఇతరుల మధ్య తేడా చూపకూడదనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం చేశామని ఆయన తెలిపారు .

‘జాతీయ గీతాన్ని సైగల భాషలో రూపొందించినందుకు మనమంతా గర్వించాలి. మన దేశంలో సైగలను చాలా పురాతన కాలం నుంచే వాడుతున్నాం’ అని మంత్రి అన్నారు. గోవింద్‌ నిహలానీ దర్శకత్వం వహించిన 3.35 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో ఎర్రకోట ముందు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కొందరు దివ్యాంగులతో కలసి జాతీయగీతాన్ని సైగలతో ఆలపిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు