జీమెయిల్, యాహూలపై నిషేధం!

13 Sep, 2014 04:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పరిరక్షించడానికిగానూ అధికారిక కార్యకలాపాల్లో జీమెయిల్, యాహూలాంటి ఈమెయిల్ సర్వీసుల వినియోగాన్ని నిషేధించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ(డీఈఐటీవై) కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసింది. దీనిపై కేంద్ర మంత్రివర్గం ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు, హ్యాకింగ్ ఘటనలు పెరిగడంతో డీఈఐటీవై ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. గూగుల్‌కు సంబంధించిన 50 లక్షల జీమెయిల్ యూజర్ నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయన్న వార్తలూ దీనికి దోహదం చేశాయి.

>
మరిన్ని వార్తలు