'సీరియస్ గా తీసుకుంటున్నాం'

28 Jan, 2016 20:21 IST|Sakshi
'సీరియస్ గా తీసుకుంటున్నాం'

న్యూఢిల్లీ: ఎయిర్ పోర్టుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. విమానాలకు బాంబు బెదిరింపులను సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పారు. సెక్యురిటీ డ్రిల్స్ పటిష్టంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ డైరీని గురువారం ఆయన ఆవిష్కరించారు.

కాగా, బుధవారం మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో అశోక్ గజపతిరాజు స్పందించారు. ఢిల్లీలో రెండు, బెంగళూరులో ఒక విమానానికి నిన్న బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది.

మరిన్ని వార్తలు