జీఎస్టీ రేట్లలో మరిన్ని మార్పులు: జైట్లీ

28 Jan, 2018 04:16 IST|Sakshi
కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ: భవిష్యత్తులో జీఎస్టీ రేట్లలో మరిన్ని మార్పులు జరుగుతాయని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. అమల్లోకి వచ్చిన ఏడాదిలోనే ఈ విధానానికి స్థిరత్వం వచ్చిందని తెలిపారు. దీని పరిధిని విస్తరించటంతోపాటు రేట్లలో హేతుబద్ధత సాధిస్తామని చెప్పారు. జీఎస్టీతో పరోక్ష పన్నుల విధానంలో సమూల మార్పులు వచ్చాయని జైట్లీ తెలిపారు. జీఎస్టీకి తుదిరూపు తెచ్చేందుకు మిగతా దేశాలతో పోలిస్తే చాలా స్వల్ప సమయం పట్టిందన్నారు.

>
మరిన్ని వార్తలు