జవాన్లకు 10 వేల కళ్లద్దాలు విరాళం ఇచ్చిన వ్యాపారులు

19 Jun, 2016 21:42 IST|Sakshi

గుజరాత్: సూరత్, గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారులు బీఎస్ఎఫ్ జవాన్లకు 10 వేల కళ్లజోళ్లు, ఆర్వో వాటర్ మిషన్లు, ఈసీజీ తదితర పరికరాలు పంపిణీ చేశారు. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల దాని నుంచి  ఉపశమనం కల్పించేందుకు జవాన్లకు అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ హజరయ్యారు. గుజరాత్ హోం మంత్రి హరిబాయ్ పార్థిబాయ్ చౌదరి అభ్యర్థన మేరకు వీటిని ఇవ్వడం హర్షణీయం అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.

మరిన్ని వార్తలు