తేజస్‌ కీలక పరీక్ష విజయవంతం

28 Feb, 2018 01:51 IST|Sakshi

బెంగళూరు: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి యుద్ధవిమానం (ఎల్‌సీఏ) ‘తేజస్‌’ మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సోమవారం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన తేజస్‌ ఎల్‌ఎస్‌పీ8 విమానం తిరిగి సురక్షితంగా చేరుకోవటంతోపాటు, ఇంజిన్‌ ఆన్‌లో ఉండగానే ఇంధనం నింపుకుంది.

ఇలాంటి సదుపాయం ఉన్న భారత వైమానిక దళ విమానాల్లో తేజస్‌ మొట్టమొదటిదని హాల్‌ తెలిపింది. తేజస్‌కు ఉన్న ఈ సౌలభ్యంతో ఇంధనం నింపుకునే సమయం సగానికి సగం తగ్గిపోతుందని వివరించింది.

మరిన్ని వార్తలు