'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం'

27 Feb, 2016 11:41 IST|Sakshi
'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం'

న్యూఢిల్లీ : రాష్ట్రంలో తాగునీటి సంఘాలకు 20 నెలల్లోనే రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో దేవినేని ఉమ మాట్లాడుతూ... హంద్రీ - నీవా మొదటి విడత 2016 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాయలసీమను హర్టీకల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు