హెడ్‌కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన కానిస్టేబుల్

8 Mar, 2015 03:12 IST|Sakshi

చింతూరు: ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌ను కానిస్టేబుల్ కాల్చిచంపాడు. సుకుమా జిల్లా ధర్మపెంటలోని ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ క్యాంపులో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్ అయోధ్యప్రసాద్ దేశ్‌ముఖ్, కానిస్టేబుల్ సమీర్ కృష్ణతీర్థల మధ్య ఓ ఘటనకు సంబంధించి వివాదం మొదలై కొట్లాడుకునే వరకూ వెళ్లింది.  సమీర్ ఆగ్రహంతో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చడంతోప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

>
మరిన్ని వార్తలు