సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో భారీగా వర్షం కురుస్తోంది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకొని ఉన్నాయి. భారీగా వర్షం కురుస్తుండటంతో రోడ్లపై వరదనీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.