తిరువనంతపురం: రానున్న 24 గంటల్లో కేరళ, లక్షద్వీప్లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయంది. రానున్న 24 గంటల్లో కేరళ, లక్షద్వీప్, దక్షిణ తమిళనాడులో గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.