వడోదరలో హైస్పీడ్‌ రైల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌

13 Sep, 2017 15:27 IST|Sakshi
వడోదరలో హైస్పీడ్‌ రైల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌

సాక్షి, వడోదర : గుజరాత్‌లోని వడోదరలో 600 కోట్ల రూపాయలతో మొదటి హైస్పీడ్‌ రైల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌  (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) బుధవారం ప్రకటించింది. ఈ సెంటర్‌ మొత్తం 5 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అస్కాత్‌ ఖరే చెప్పరు. ట్రైనింగ్‌ సెంటర్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్రైనింగ్‌ సెంటర్‌లో ఓవర్‌హెడ్‌ ఎలక్ట్రికల్‌ సిస్టమ్‌, బుల్లెట్‌ ట్రైన్‌ ట్రాక్‌ ఏర్పాటు వంటివాటిపై ప్రాథమిక శిక్షణ ఉంటుందని చెప్పారు.


 

మరిన్ని వార్తలు