పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడి చేసింది మేమే

4 Jan, 2016 19:41 IST|Sakshi
పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడి చేసింది మేమే

పఠాన్కోట్ : పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్పై దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ ప్రేరేపిత యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ ప్రకటించుకుంది. వైమానిక స్థావరంపై దాడిలో కాశ్మీరీ తీవ్రవాదులే పాల్గొన్నారని ఆ సంస్థ వెల్లడించారు.  వివిధ తీవ్రవాద గ్రూపులతో ఏర్పాటైన కశ్మీర్ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్కు ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ చీఫ్గా ఉన్నాడు. తమకు చెందిన హైవే స్క్వాడ్ దాడులు చేసినట్లు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ పేర్కొంది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం మాత్రం కొట్టిపారేసింది. మూడోరోజు కూడా పఠాన్ కోట్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

కాగా పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరాన్ని ఉగ్రవాదులు ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది.  భారత్‌-పాక్‌ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వైమానిక స్థావరం.  పాకిస్థాన్‌ నుంచి భారత్‌పై దాడి జరిగితే మొదటి రక్షణ కవచం  ఇది. జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించే ఆపరేషన్స్‌కు  ఇది సపోర్టుగా ఉంటుంది.  75 ఎకరాల  విస్తీర్ణంలో ఉండే ఈ వైమానిక స్థావరంలో  మిగ్‌ -21 ఫైటర్‌ విమానాలు 108 మంది స్వ్కాడ్రన్‌ లీడర్స్‌ ఉంటారు. 125 హెలికాప్టర్‌ యూనిట్‌ గ్లాడియేటర్స్‌కు కూడా ఇది స్థావరం 1965 యుద్ధం నుంచి  పాకిస్థాన్‌ పఠాన్‌కోట్‌ను టార్గెట్‌ చేసింది.  1971లో జరిగిన యుద్ధంలో ఇక్కడి రన్‌ వే కొంచెం దెబ్బతింది. ఈ ఎయిర్‌ బేస్‌ను 'ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా'గా చెప్పుకుంటారు. 

మరిన్ని వార్తలు