హిందీ కవి కేదార్‌నాథ్‌కు జ్ఞాన్‌పీఠ్

21 Jun, 2014 03:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని 2013 సంవత్సరానికి గాను ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్‌కు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో జన్మించిన 80 ఏళ్ల కేదార్‌నాథ్ కవితలనే కాకుండా పలు వ్యాసాలు, కథలు కూడా రాశారు. ‘అభీ బిల్‌కుల్ అభీ’, ‘యహా సె దేఖో’ తదితర రచనలు ఆయనకు పేరు తెచ్చాయి. ఆయనను రూ.11 లక్షల నగదు, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్లు జ్ఞాన్‌పీఠ్ అవార్డు ఎంపిక కమిటీ శుక్రవారం తెలిపింది.

>
మరిన్ని వార్తలు