మతం మారినవారిని హిందువులుగా మారుస్తాం:తొగాడియా

28 Dec, 2014 20:55 IST|Sakshi
ప్రవీణ్ తొగాడియా

హైదరాబాద్: మతం మారినవారిని తిరిగి హిందువులుగా మారుస్తామని విశ్వహిందూపరిషత్(విహెచ్పి) అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా చెప్పారు. ఈ రాష్ట్రంలో నిజాం సర్కార్ తేవాలని చూస్తే ప్రతి వ్యక్తి సర్దార్ పటేల్గా మారతాడని హెచ్చరించారు. ముస్లింలు, క్రైస్తవులు హిందువుల వారసులేనని అన్నారు.

హిందువులు అంతా ఐకమత్యంగా ఉంటే హిందువులలో ఎవరూ పేదరికంలో ఉండరని అన్నారు. దేశంలో హిందూ రాజ్యం వచ్చిందని, ఈ రాష్ట్రంలో కూడా హిందూ రాజ్యం రావాలన్న ఆకాంక్షను  తొగాడియా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు