శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ నాడు, నేడు, ఎప్పుడూ కూడా భారతదేశంలో అంతర్భాగమేనని.. అందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికీ కూడా జమ్ము భారత్లో అంతర్భాగంగానే ఉంటుందన్నారు.
ప్రస్తుతం కశ్మీర్లో ఉన్న తాజా పరిస్థితులపై ఆయన స్పందించారు. కశ్మీర్ అంశాన్ని పార్లమెంట్ తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్లో పర్యటించిన అఖిలపక్ష బృందం స్థానిక నేతలతో మాట్లాడిందని చెప్పారు. అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డా.సంజయ్రాయ్ నేతృత్వంలో కశ్మీర్ సమస్యల పరిష్కారానికి నోడల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు.