రాజస్థాన్‌లో కూలిన యుద్ధ విమానం

4 Sep, 2018 10:19 IST|Sakshi

జైపూర్‌ : రాజస్ధాన్‌లో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం జోధ్‌పూర్‌ సమీపంలోని బనార్‌ ప్రాంతంలో మంగళవారం కుప్పకూలింది. సాంకేతిక సమస్యలతో పంటపొలంలో హెలికాఫ్టర్‌ కూలగా, ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు.

విమానం కూలిన క్రమంలో ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక బృందంతో పాటు వాయుసేన అధికారులు, పోలీసు సిబ్బంది చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు