మిగ్‌–27కు వీడ్కోలు

28 Dec, 2019 06:32 IST|Sakshi

జోథ్‌పూర్‌: దాదాపు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన మిగ్‌(ఎంఐజీ)–27 యుద్ధ విమానాలు ఇక విశ్రాంతి తీసుకోనున్నాయి. జోథ్‌పూర్‌ వైమానిక స్థావరంలో శుక్రవారం జరిగిన మిగ్‌ వీడ్కోలు కార్యక్రమంలో సౌత్‌ వెస్ట్రన్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌కే ఘోటియా పాల్గొన్నారు. ఈ విమానాలు పోరాటక్షేత్రంలో ముందు నిలిచాయని, 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో అమూల్యమైన సేవలందించాయని తెలిపారు. ఇన్నాళ్లూ జోథ్‌పూర్‌ ఎయిర్‌ బేస్‌లో మిగ్‌–27 రకం విమానాలు ఏడు వరకు సేవలందించాయి.

మరిన్ని వార్తలు