22 ఏళ్లు..రూ.1.2 కోట్ల వేతనం!

9 Jul, 2018 04:14 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ–బి)లో ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చదువుతున్న ఆదిత్య పలివాల్‌(22) సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్‌లో ఏడాదికి రూ.1.2 కోట్ల భారీ వేతనంతో కొలువు సాధించాడు.  గూగుల్‌ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ పరీక్షలో ఆరువేల మంది పాల్గొనగా 50 మంది ఎంపికయ్యారు. వారిలో ఆదిత్య ఒకడు. ఈ నెల 16న న్యూయార్క్‌లో గూగుల్‌ కృత్రిమ మేథ, పరిశోధనా విభాగంలో ఉద్యోగంలో చేరనున్నాడు.

మరిన్ని వార్తలు