పన్ను చెల్లింపుదారులకు ఊరట

4 Jul, 2020 12:03 IST|Sakshi

నవంబర్‌ 30 వరకు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పెంపు

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు మరో ఊరట కల్పించింది.  ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) ఫైలింగ్‌ గడువును  పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్‌ ఫైలింగుల గడువును ఈ ఏడాది నవంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ శనివారం ప్రకటించింది.

ప్రస్తుత   కష్టసమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ ట్వీట్‌ చేసింది.  ఇది పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు  సహాయపడుతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు