సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి వియ్యంకుడు సుబ్రమణ్యం నివాసంలో మంగళవారం ఐటీ సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు సుబ్రమణ్యంను అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
ఇప్పటివరకు చెన్నైలో జరిగిన ఐటీ సోదాల్లో కాంట్రాక్టర్ సెయ్యాదురై, ఆయన బంధువుల నివాసంలో 160 కోట్లు నగదు, 100 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సెయ్యాదురై ట్వీట్ ఒకటి సంచలం సృష్టిస్తోంది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెయ్యాదురై శుభాకాంక్షలు తెలపడం విశేషం.