సాక్షి, చెన్నై: నగరంలోని జీ స్క్వేర్, శరవణ బ్రహ్మాండమయ్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు గురువారం ముగిశాయి. విస్తృతంగా చేపట్టిన ఈ సోదాల్లో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. లెక్కలు చూపించని రూ. 433 కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 25 కోట్ల నగదు, 12 కేజీల బంగారం, 66 క్యారెట్ల వజ్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.