న్యూఢిల్లీ: ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ పోస్టు రేసులో భారత్ ఓడిపోయింది. జర్మనీకి చెందిన యూర్గెన్ స్టాక్(54)ను ఆ స్థానంలో నియమించాలని ఇంటర్పోల్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఈ పదవికి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జోర్డాన్, బ్రిటన్ల నుంచి ఒక్కొక్కరు పోటీపడగా.. భారత్ నుంచి సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా పోటీపడ్డారు. ఫ్రాన్స్లో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన పేరు తుది జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ.. పదవి మాత్రం దక్కలేదు