పాక్ ఖైదీలను విడుదల చేసిన భారత్

1 Mar, 2017 22:41 IST|Sakshi
పాక్ ఖైదీలను విడుదల చేసిన భారత్

అమృత్‌సర్: పాకిస్తాన్‌కు చెందిన ఖైదీలను భారత ప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసింది. దాయాది పాకిస్తాన్ తరచుగా కయ్యానికి కాలు దువ్వుతున్నా.. భారత్ మాత్రం ఎప్పుడూ స్నేహశీలిగానే ఉంటూ వచ్చిందనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది.  భారత్‌లో ఉంటున్న 39 మంది ఖైదీలను వారి సొంతమైన పాకిస్తాన్‌కు పంపివేసింది. వాఘా-అత్తారీ మార్గం నుంచి ఖైదీలను వారి సొంత ప్రాంతాలకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. తమ కుటుంబీకులను, బంధువులను మళ్లీ కలుసుకోబోతున్న సంబరాలలో ఖైదీలు తమ దేశానికి వెళ్లిపోతారు.
 

మరిన్ని వార్తలు