చోక్సీని వెనక్కు పంపండి: భారత్‌

6 Aug, 2018 05:38 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేల కోట్లకు మోసగించి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న మెహుల్‌ చోక్సీని వెనక్కు పంపాలని ఆ ప్రభుత్వాన్ని భారత్‌ అభ్యర్థించింది. చోక్సీని  తిరిగి తీసుకొచ్చే విషయమై ఆంటిగ్వా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత్‌ నుంచి ఓ బృందం కొన్ని రోజుల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు అధికార వర్గాలు చెప్పాయి. భారత బృందం ఆంటిగ్వా విదేశాంగ శాఖను శనివారం కలిసి, చోక్సీని భారత్‌కు తిప్పి పంపాలని అభ్యర్థించినట్లు ఓ అధికారి వెల్లడించారు. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, అతని బంధువైన చోక్సీ కలిసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.12 వేల కోట్ల మేర మోసగించి దేశం నుంచి పారిపోవడం తెలిసిందే.

మరిన్ని వార్తలు