ఢిల్లీవాసి ఆయుర్దాయం పదేళ్లు తగ్గింది!

20 Nov, 2018 05:06 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల్లో చూస్తే 2016లో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణస్థాయిలకు దిగజారిందని, దాంతో ఢిల్లీవాసుల ఆయుర్దాయం పదేళ్లకుపైగా తగ్గిందని తాజాగా వెల్లడైంది. అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. నివేదిక ప్రకారం.. వాయుకాలుష్యం పెరిగి 1998తో పోల్చితే దేశంలో సూక్ష్మధూళి కణాలు ప్రస్తుతం సగటున 69శాతం ఎక్కువయ్యాయి. దీంతో భారతీయుని ఆయుర్దాయం 4.3 సంవత్సరాలు తగ్గింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ రెండోస్థానంలో నిలిచింది. నేపాల్‌ తర్వాత ప్రపంచంలో అత్యంత కాలుష్యమయమైన దేశం భారత్‌ కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు