విద్యా రంగంలో భారత్, దక్షిణ ఆస్ట్రేలియా భాగస్వామ్యం

23 Aug, 2014 21:38 IST|Sakshi
విద్యా రంగంలో భారత్, దక్షిణ ఆస్ట్రేలియా భాగస్వామ్యం

న్యూఢిల్లీ: భారత్, దక్షిణ ఆస్ట్రేలియా పరస్పర సహాకారంతో విద్య రంగంలో కలసి పనిచేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. దక్షిణ ఆస్ట్రేలియా మంత్రి జే వెదరిల్ శుక్రవారం స్మృతి ఇరానీతో సమావేశమయ్యారు.


ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, వైమానిక, రక్షణ, పునరుత్పాదక శక్తి, నీటి నిర్వహణ, ఖనిజ వనరులు తదితర రంగాల్లో భారత్తో కలసి పనిచేసేందుకు దక్షిణ ఆస్ట్రేలియా ఆసక్తి చూపినట్టు స్మృతి చెప్పారు. దేశంలోని పలు ప్రఖ్యాత విద్యా రంగ సంస్థలు, ఆస్ట్రేలియా సంస్థలతో కలసి పనిచేస్తాయని తెలిపారు.

మరిన్ని వార్తలు