విజయవంతంగా భారత్‌ క్షిపణి పరీక్షలు

26 Feb, 2019 16:08 IST|Sakshi

భువనేశ్వర్‌: ఉపరితలం నుంచి గగనతలంలోకి సత్వరమే ప్రయోగించగల రెండు క్షిపణులను భారత్‌ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సహకారంతో రూపొందించిన ఈ క్షిపణులను ఒడిశా తీరంలోని ప్రయోగించారు. భారత సైన్యం కోసం దేశీయ పరిజ్ఞానంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్షిపణులు 25 నుంచి 30 కిలోమీటర్ల లక్ష్యాలను సత్వరమే ఛేదిస్తాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఆయుధాలను మోసుకెళ్లడమే కాకుండా ప్రత్యర్థి పక్షం గుర్తించి కూల్చేస్తాయి.

మరిన్ని వార్తలు