క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రయోగం సక్సెస్‌

24 Sep, 2018 05:54 IST|Sakshi

బాలాసోర్‌: గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. శత్రుదేశాలు బాలిస్టిక్‌ క్షిపణుల్ని ప్రయోగిస్తే గాల్లోనే పేల్చివేయగల రెండంచెల క్షిపణి నిరోధక వ్యవస్థను ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్‌ కలామ్‌ ఐలాండ్‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత ఓ క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. రాడార్లు అప్రమత్తం చేయడంతో అప్పటికే సిద్ధంగా ఉన్న పృథ్వీ డిఫెన్స్‌ వెహికల్‌(పీడీవీ) దీన్ని నిలువరించేందుకు గాల్లోకి దూసుకెళ్లింది. అనంతరం భూమికి 50 కి.మీ ఎత్తులో క్షిపణిని పృథ్వీ నాశనం చేసింది.

మరిన్ని వార్తలు