న్యూఢిల్లీ : భారతదేశంలో వాయు, జల, వాతావరణ కాలుష్యాలు పతాకస్థాయిలో కొనసాగుతున్నాయి. ప్రపంచంలో రోజు రోజుకు పెరగుతున్న కాలుష్యం కారణంగా లక్షలాది మంది ప్రజలు మరణిస్తున్నారని, ఈ మరణాల్లో భారత దేశమే అన్ని దేశాలకన్నా అగ్రస్థానంలో ఉందని కాలుష్యం, ఆరోగ్యంపై లాన్సెట్ కమిషన్ గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క 2015 సంవత్సరంలోనే 90లక్షల మంది మరణించగా, భారత దేశంలో అదే సంవత్సరం 25 లక్షల మంది మరణించారని ఆ నివేదిక పేర్కొంది. 18 లక్షల మంది మృతితో చైనా రెండవ స్థానంలో ఉందని తెలిపింది.
హృదయ సంబంధిత రోగాలు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోసంబంధిత వ్యాధుల వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని సర్వే ప్రకటించింది. భారత్, చైనా దేశాల తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, హైతీ దేశాలు అధిక కాలుష్యంతో బాధ పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరంగా వాసిగెక్కిన ఢిల్లీతోపాటు ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఈ దీపావళి అనంతరం కాలుష్యం తీవ్రంగా పెరిగింది.
లాన్సెట్ జర్నల్ సర్వే ముఖ్యాంశాలు