సైన్యంలో తొలి కరోనా కేసు

18 Mar, 2020 08:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యంలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. జమ్ము కశ్మీర్‌లోని లీ ప్రాంతానికి చెందిన సైనికుడికి వైరస్‌ సోకినట్టు వెల్లడైంది. కాగా బాధిత సైనికుడు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకూ సెలవులో ఉన్నారు. సైనికుడి తండ్రి ఇటీవల ఇరాన్‌ యాత్ర ముగించుకుని వచ్చినట్టు సమాచారం. ఇక భారత్‌ వైరస్‌ వ్యాప్తిలో మూడవ దశలో లేదని, రెండవ దశలో ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) స్పష్టం చేసింది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించే క్రమంలో టెస్టింగ్‌ కోసం 72 పంక్షనల్‌ లేబొరేటరీలు అందుబాటులో ఉన్నాయని, ఈవారాంతానికి మరో 49 ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు. డెడ్లీ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విదేశీయుల ప్రవేశంపై నిషేధం సహా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ భారత్‌లో కరోనా కేసులు 137కి పెరిగాయి. ఇక రైల్వేలు సైతం వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 85 రైళ్లను రద్దు చేశాయి.

చదవండి : ‘ఇలాగైతే అమెరికాలో 22 లక్షల మరణాలు’

మరిన్ని వార్తలు