విద్యాభివృద్ధికి ఐఈఎస్ అధికారులు?

26 May, 2016 10:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్ తరహాలో దేశవ్యాప్తంగా పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (ఐఈఎస్)ను ఏర్పాటుచేయాలని బాలల హక్కుల సంరక్షణ జాతీయ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ప్రతిపాదించింది.

‘కొత్త విద్యావిధానం-2016’ రూపకల్పనలో భాగంగాహెచ్చార్డీకి చేసిన ప్రతిపాదనల్లో.. ఐఈఎస్ వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరాన్ని వివరించింది. దీంతోపాటు పాఠశాల విద్యను గాడినపెట్టేందుకు రాష్ట్రాల విద్యా కమిషన్లను ఏర్పాటుచేయాలని సూచించింది. విద్యాహక్కు చట్టంలో 15-18 ఏళ్ల లోపు వారికి సెకండరీ విద్యనందించటాన్ని తప్పనిసరి చేస్తూ మార్పులు చేయాలని ప్రతిపాదించింది.
 

మరిన్ని వార్తలు