రైళ్లలోనూ వాక్యూమ్‌ టాయిలెట్లు

18 Jun, 2018 06:10 IST|Sakshi

న్యూఢిల్లీ: రైళ్లలోనూ విమానాల తరహాలో వాక్యూమ్‌ టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఇందులోభాగంగా తొలిదశలో రైళ్లలో 500 వాక్యూమ్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మొత్తం రైళ్లల్లో 2.5 లక్షల వాక్యూమ్‌ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో టాయిలెట్‌కు రూ.2.5లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. వీటి వల్ల 1/20 వంతు నీటి ఆదాతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు