కరోనా: కదలనున్న పార్సిల్‌ రైళ్లు..

30 Mar, 2020 07:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఈ నెల 22 నుంచి రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే కూరగాయల వంటి అత్యవసర సరుకులను రవాణా చేసేందుకు రైల్వే శాఖ కొన్ని పార్సిల్‌ వ్యాన్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ పార్సిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఢిల్లీ–గువాహటి, ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కళ్యాణ్, ఢిల్లీ–హౌరా, చండీగఢ్‌–జైపూర్, మోగా–ఛంగ్సారి మార్గాల్లో తిరుగుతాయి. ఈ రైళ్లలో కూరగాయలు, పాల ఉత్పత్తులు, మందులు, చేపలు వంటివి రవాణా అవుతాయని అధికారులు చెప్పారు. (కరోనా : 7లక్షలకిచేరువలో కేసులు)
చదవండి: నన్ను క్షమించండి

మరిన్ని వార్తలు