న్యూఢిల్లీ : జూన్ నెలలో ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనాల కంటే కొంత మెరుగ్గా వచ్చింది. 4.86 శాతంగా నమోదైంది. 5 శాతంగా వస్తుందని మార్కెట్ వర్గాలు భావించాయి. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. రూపాయి పతనం ప్రభావం ఇంకా మార్కెట్లో పూర్తి స్థాయిలో కనిపించలేదని మున్ముందు ద్రవ్యోల్బణం మళ్లీ 5 శాతం పైకి రావొచ్చని భావిస్తున్నారు.
మరోవైపు ఆహార ద్రవ్యోల్బణం 9.74 శాతంగా నమోదైంది. అంతకు ముందు నెలలో 8.2 శాతంగా ఉంది. రుతుపవనాలు చురుగ్గా ఉండటం, వర్షాలు జోరుగా కురుస్తుండటంతో మున్ముందు కూరగాయలు, పండ్ల ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.