కోడి పందేల నిర్వహణపై నేడు విచారణ

12 Jan, 2018 01:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కోడి పందేల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించనుంది. పిటిషనర్‌ కనుమూరు రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది గల్లా సతీష్‌ ఈ పిటిషన్‌ను గురువారం ప్రస్తావించగా సోమవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే అప్పటికి పండుగ పూర్తవుతుందని న్యాయవాది నివేదించగా శుక్రవారం విచారణ చేపట్టేందుకు అనుమతిచ్చారు.

మరిన్ని వార్తలు