ఎంజీఆర్, జయలలిత విగ్రహాల ఏర్పాటు

28 Feb, 2017 22:29 IST|Sakshi

క్రిష్ణగిరి(సూళగిరి): తమ లీడర్‌పై నాయకులకు అమితమైన ప్రేమ ఉంటుంది. అలాంటి అభిమానం ఎంతటికైనా దారితీస్తుంది. ఆ అభిమానమే వారి విగ్రహాల ఏర్పాటుకు కారణమైంది.  తమిళనాడులోని సూళగిరి యూనియన్‌ అన్నాడీఎంకే వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి తన సొంత స్థలంలో, సొంత ఖర్చుతో దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలను ఏర్పాటు చేశారు.

విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం​ మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుడు గోవిందు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నాడీఎంకే నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హజరయ్యారు.
 

మరిన్ని వార్తలు