మాజీ ఐఏఎస్‌ 225 కోట్ల ఆస్తుల అటాచ్‌

21 Mar, 2019 04:57 IST|Sakshi
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నేత్‌రామ్

న్యూఢిల్లీ: పన్ను ఎగవేత, మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నేత్‌రామ్, ఆయన సన్నిహితులకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తుల్ని ఆదాయ పన్ను శాఖ అటాచ్‌ చేసింది. ఇందులో ఢిల్లీ, ముంబై, నోయిడా, కోల్‌కతాలోని స్థిరాస్తులు ఉన్నాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బూటకపు కంపెనీల్లో నేత్‌రామ్, ఆయన సన్నిహితులు కొందరు రూ.98.82 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ విభాగానికి సమాచారం అందడంతో గతంలో ఢిల్లీ, లక్నో, ముంబై, కోల్‌కతా, బరేలిలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై సోదాలు చేసింది. 1979 బ్యాచ్‌కు చెందిన నేత్‌రామ్‌ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు ఉన్నత స్థానాల్లో పనిచేశారు. 

మరిన్ని వార్తలు