ఆదాయ పన్ను అధికారులపై కొరడా

10 Jun, 2019 20:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆదాయ పన్ను(ఐటీ) శాఖలో అవినీతి అధికారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ల స్థాయిలో ఉన్న 12 మంది అధికారులను ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని 56 నిబంధనను అనుసరించి నిర్బంధంగా పదవీ విరమణ చేయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అధికారుల్లో కొందరిపై అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు, అక్రమాస్తులు కూడగట్టిన ఆరోపణలున్నాయి. మరికొందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయని సమాచారం.

మరిన్ని వార్తలు