జగతి ఎఫ్‌డీల కేసు విచారణ 27కి వాయిదా

8 Aug, 2013 03:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీలు)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అటాచ్ చేయడానికి సంబంధించిన కేసులో పీఎంఎల్‌ఏ న్యాయ ప్రాధికార సంస్థ చేపట్టిన విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది. ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ న్యాయ ప్రాధికార సంస్థ చైర్మన్ కె.రామమూర్తి ఎదుట బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈడీ లేవనెత్తిన పలు అంశాలపై కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత వ్యవధి కావాలని ఈ సందర్భంగా జగతి తరఫు న్యాయవాది రవిగుప్తా అభ్యర్థించారు. ఇందుకు సమ్మతించిన రామమూర్తి.. ఇరుపక్షాల న్యాయవాదులను సంప్రదించిన అనంతరం ఈ నెల 27కి విచారణను వాయిదావేశారు.

మరిన్ని వార్తలు