‘జల్లికట్టు’ యువత కొత్త పార్టీ

26 Feb, 2017 02:35 IST|Sakshi

సాక్షి, చెన్నై: జల్లికట్టు ఉద్యమానికి నేతృత్వంవహించిన యువతలోని పలువరి ఆధ్వర్యంలో‘ నాదేశం...నాహక్కు’ పేరుతో తమిళనాడులో శనివారం కొత్త పార్టీ ఆవిర్భవించింది. రుంబాక్కంలోని ఒక హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పార్టీని ప్రకటించారు.

ఇందులో కన్వీనర్లుగా ఎబినేజర్, సత్య, ప్రవీణ, సుకన్య, కార్తీ, స్వతంత్ర దేవి, ప్రకాష్, ప్రసాద్‌ వ్యవహరించనున్నారు. ఈ పార్టీ జెండాను జాతీయ పతాకం తరహాలో రూపొందించారు. మధ్యలో సంకెళ్లు తెంచుకున్న యువకుడి చిత్రాన్ని పొందుపరిచారు.

మరిన్ని వార్తలు