పోలింగ్ బూత్ సమీపంలో పేలిన బాంబు

25 Nov, 2014 11:58 IST|Sakshi

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను హింసాత్మకంగా మార్చాలని కంకణం కట్టుకున్న ఉగ్రవాదులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఏకంగా పోలింగ్ బూత్‌లనే టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బందీపురా జిల్లాలో మంగళవారం బాంబు పేలింది. పోలింగ్ కేంద్రం వెలుపల తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలినట్లు తెలుస్తోంది. పేలుడు శబ్దం విన్న భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించాయి. జమ్ము కశ్మీర్‌లో ఇవాళ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో బందీపురా జిల్లా కూడా ఉంది.  

 

మరిన్ని వార్తలు