ఇద్దరు ఉగ్రవాదులు హతం

27 Jul, 2019 11:52 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులకు, భారత సెక్యూరిటీ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ జిల్లా బోనాబజార్‌లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో ఆర్మీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య  ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం షోపియాన్‌ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 

>
మరిన్ని వార్తలు