శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని హంద్వారాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆందోళన కారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళన కారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.