‘కోమాలో కాంగ్రెస్‌ నాయకత్వం’

7 Jul, 2019 19:41 IST|Sakshi

శ్రీనగర్‌ : కాంగ్రెస్‌ పార్టీ కోమాలో ఉందని ఆ పార్టీకి ఆదివారం రాజీనామా చేసిన సీనియర్‌ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ మాలిక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైందని, తమ గోడును వినే నాధుడే లేడని రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ గులాం అహ్మద్‌ మిర్‌కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీలో రాష్ట్ర స్ధాయితో పాటు జాతీయ స్ధాయిలో లాబీయింగ్‌ సంస్కృతి పెరిగిపోయిందని ఆరోపించారు.

పదేళ్ల కిందట తాను కాంగ్రెస్‌లో చేరినప్పటి పరిస్థితులు ఇప్పుడు పార్టీలో లేవని పెదవివిరిచారు. తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకే తాను కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నానని చెప్పారు. మరోవైపు పార్టీ సీనియర్‌ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, ముంబై కాంగ్రెస్‌ చీఫ్‌ మిలింద్‌ డియోరాలు సైతం పార్టీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు