రెండు వారాల్లో రూ.3,285కోట్లు డ్రా చేశారు

1 Jan, 2017 16:59 IST|Sakshi
రెండు వారాల్లో రూ.3,285కోట్లు డ్రా చేశారు

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వారానికి రూ.24వేలు కూడా డ్రా చేసుకోలేని పరిస్థితి. అలాంటిది కేవలం రెండు వారాల్లోనే దాదాపు రూ.3,285కోట్లను డ్రా చేసి ఐటీ అధికారులను అవాక్కయ్యేలా చేశారు. అది కూడా జన్‌ ధన్‌ ఖాతాలో నుంచి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత జన్‌ ధన్‌ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్‌ అయిన విషయం తెలిసిందే.

గత డిసెంబర్‌ 14నాటికి జన్‌ ధన్‌ ఖాతాల్లో మొత్తం రూ.74,610కోట్లు ఉండగా అవికాస్తం పద్నాలుగు రోజులు గడిచిన తర్వాత రూ.71,037కోట్లకు తగ్గినట్లు ఆర్థికశాఖ సేకరించిన సమాచారం ప్రకారం తెలిసింది. మొత్తం రూ.3,285కోట్లను రెండు వారాల్లో డ్రా చేయడం గతంలో ఉన్న పరిస్థితుల కంటే ఇదే తొలిసారి అని ఆర్ధికశాఖ అధికారులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు